పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR) మండిపడ్డారు. ద్రోహపు ఎత్తుగడలతో పార్టీని దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారని కేటీఆర్‌ అన్నారు. శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్‌(KCR) అని చెప్పారు.

పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR) మండిపడ్డారు. ద్రోహపు ఎత్తుగడలతో పార్టీని దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారని కేటీఆర్‌ అన్నారు. శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్‌(KCR) అని చెప్పారు. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారుచేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్‌ది అని అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు ఏమీ చేయలేవని కేటీఆర్‌ తెలిపారు. ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణను సాధించి తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్‌ని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని పేర్కొన్నారు. నికార్సైన కొత్తతరం నాయకత్వాన్ని తయారు చేస్తామని, పోరాట పంథాలో కదం తొక్కుతామని సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ వెల్లడించారు.

Updated On 29 March 2024 1:56 AM GMT
Ehatv

Ehatv

Next Story