బ్యూటీఫికేషన్‌ కాదు.. లూటిఫికేషన్‌

హైడ్రా(Hydra) విషయంలో రాహుల్ గాంధీ(Rahul gandhi) పైన కేటీఆర్(KTR) సంచలన ఆరోపణలు చేశారు. మూసీ ప్రాజెక్టును రాహుల్ గాంధీ డబ్బుల సంచుల కోసమే అనుమతి ఇచ్చారు. రేవంత్‌రెడ్డి(Revanth reddy) కాదు రాహుల్ గాంధీనే హైడ్రాను నడిపిస్తున్నాడని కేటీఆర్‌ అన్నారు. రాహుల్‌గాంధీ వెనుక ఉండి పేదల ఇండ్ల పైకి బుల్డోజర్ నడిపిస్తుండు. కేవలం డబ్బుల కోసమే రాహుల్ గాంధీ మూసీ ప్రాజెక్టు చేపట్టండన్నారు కేటీఆర్. హైదరాబాద్ నగరంలో బుల్డోజర్ ప్రభుత్వంతో ప్రజలు చచ్చిపోతుంటే రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చిన్నపిల్లలు పిలిచినా సరే వస్తా అని చెప్పిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు ఎక్కడ సచ్చాడో చెప్పాలన్నారు. ఢిల్లీ డబ్బుల కట్టల కోసమే రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం పేదల ఇళ్లను కూల్చేయిస్తోందన్నారు. ఈ ప్రాజెక్ట్ ఏ కాంట్రాక్టర్‌కు ఇస్తారో కూడా తెలుసు. ఆ వివరాలను త్వరలోనే బయటపెడతానని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి మూసీ నోట్ల కట్టలు కావాలి. కానీ మూసీ బాధితులు కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు. మూసీ లూటీఫికేషన్ అని కేటీఆర్‌ విమర్శించారు.

Eha Tv

Eha Tv

Next Story