ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలంలో జరిగిన అత్యాచార(Rape) ఘటన, తదనంతరం చెలరేగిన హింసపై బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR) రియాక్టయ్యారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలంలో జరిగిన అత్యాచార(Rape) ఘటన, తదనంతరం చెలరేగిన హింసపై బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR) రియాక్టయ్యారు. ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని విమర్శించారు. 'కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా(Asifabad) జైనూర్‌ మండలంలో ఒక ఆదివాసీ మహిళపై(Tribe Woman) జరిగిన అత్యాచారయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ జరిగిన హింసాత్మక చర్యల్లో అనేక ఆస్తుల విధ్వంసం జరగడం దురదృష్టకరం. బాధిత మహిళకు కేవలం లక్ష రూపాయల "పరిహారం" ఇచ్చి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గం. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ముందస్తు సమాచారం ఉన్నా వాటిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. జైనూర్‌లో తక్షణమే శాంతి నెలకొనేలా రాష్త్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలి. అల్లర్లలో ఇళ్లు, షాపులు కోల్పోయినవారికి సాయంగా నిలవాలి. పూర్తి స్థాయి హోం మంత్రి లేకుండానే తొమ్మిది నెలలుగా రాష్ట్రాన్ని నడపడం వల్లనే తరచూ ఇటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి' అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు కేటీఆర్‌.

Eha Tv

Eha Tv

Next Story