కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వాన్ని నిలదీస్తూ, కేసీఆర్‌ను(KTR) పొగిడిన నల్గొండ జిల్లా రైతు వీడియోను పోస్టు చేసిన జర్నలిస్టుపై(Journalist) పోలీసులు కేసు నమోదు చేశారు.

కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వాన్ని నిలదీస్తూ, కేసీఆర్‌ను(KTR) పొగిడిన నల్గొండ జిల్లా రైతు వీడియోను పోస్టు చేసిన జర్నలిస్టుపై(Journalist) పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) రియాక్టయ్యారు. జర్నలిస్టు చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. 'ఆ రైతును నేను కూడా కలిశాను... అతనితో మాట్లాడాను... మరి నాపై కూడా కేసు పెడతారా డీజీపీ గారూ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా గెలిచిందని, కేసీఆర్ గెలవాల్సిందని నల్గొండ జిల్లాలోని ముషంపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లయ్య అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ గౌతమ్ పోతగోని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు ఆ జర్నలిస్ట్‌పై కేసు పెట్టారు. అసలు ఈ వీడియోలో తప్పు ఏముందని డీజీపీని ప్రశ్నించారు కేటీఆర్‌. జర్నలిస్ట్ గౌతమ్ గౌడ్‌పై కేసు ఎందుకు నమోదు చేశారని నిలదీశారు. నేను కూడా ముషంపల్లిలో రైతు మల్లయ్యను కలిశాను. అతనితో మాట్లాడాను. అలాంటప్పుడు నాపై కూడా కేసు పెడతారా?' అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story