ఎర్రవెల్లి(Erravelli) నివాసంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌(BRS) అధినేత కేసీఆర్‌(KCR) వేద పండితులతో నవగ్రహ యాగం చేపట్టారు.

ఎర్రవెల్లి(Erravelli) నివాసంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌(BRS) అధినేత కేసీఆర్‌(KCR) వేద పండితులతో నవగ్రహ యాగం(Navagraha yagam) చేపట్టారు. నవగ్రహ యాగానంతరం కేసీఆర్‌ రాజకీయ ప్రణాళికను సిద్ధం చేసుకోబోతున్నారు. ఇప్పటికే జిల్లా పర్యటనలకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌ ఇక వినాయకచవితి పండుగ తర్వాత ప్రజల చెంతకు వెళ్లాలనుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టబోతున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్‌ అంటోంది. చవితి పండుగ తర్వాత బస్సు యాత్రలు చేపట్టబోతున్నారు. పండుగ రోజున ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం! మొత్తం మీద కేసీఆర్ పెద్ద వ్యూహాన్నే పన్నుతున్నారు.

Updated On 6 Sep 2024 10:29 AM GMT
Eha Tv

Eha Tv

Next Story