తెలంగాణలో బీజేపీ(BJP), బీఆర్ఎస్‌ల(BRS) మ‌ధ్య రాజ‌కీయంగా అంత‌గా స‌ఖ్య‌త లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay).. సీఎం కేసీఆర్(CM KCR) పై.. ఆయన కుటుంబ సభ్యులపై విమ‌ర్శ‌లు చేస్తుండ‌గా.. బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్‌.. ఆయ‌న త‌న‌యుడు, మంత్రి కేటీఆర్‌(KTR), త‌న‌య క‌విత(Kavitha) వీలు దొరిన‌ప్పుడ‌ల్లా బీజేపీపై విరుచుకుప‌డుతూనే ఉన్నారు.

తెలంగాణలో బీజేపీ(BJP), బీఆర్ఎస్‌ల(BRS) మ‌ధ్య రాజ‌కీయంగా అంత‌గా స‌ఖ్య‌త లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay).. సీఎం కేసీఆర్(CM KCR) పై.. ఆయన కుటుంబ సభ్యులపై విమ‌ర్శ‌లు చేస్తుండ‌గా.. బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్‌.. ఆయ‌న త‌న‌యుడు, మంత్రి కేటీఆర్‌(KTR), త‌న‌య క‌విత(Kavitha) వీలు దొరిన‌ప్పుడ‌ల్లా బీజేపీపై విరుచుకుప‌డుతూనే ఉన్నారు. ఇటీవ‌ల‌ ఢిల్లీ లిక్కర్ కేసులో క‌విత‌, తెలంగాణ‌లో టెన్త్ పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారంలో బండి సంజ‌య్ పేర్లు రావ‌డంతో ఇరు వ‌ర్గాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకున్నారు. వ‌రుస‌ ప్రెస్ మీట్లు పెట్టి ఒక‌రినొక‌రు టార్గెట్ చేసుకున్నారు. ఈ వైరం ఇలా కొన‌సాగుతుండ‌గా.. ఎంపీ బండి సంజ‌య్‌, ఎమ్మెల్సీ క‌విత ఓ వేడుక‌లో ఎదురుప‌డ్డారు. దీంతో ఆత్మీయంగా ప‌లుక‌రించుకున్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య(Baswa Lakshmi Narsaiah) నిజామాబాద్‌లో కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఇంటి గృహ ప్రవేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay), కల్వకుంట్ల కవితను(Kavitha) ఆహ్వానించారు. అయితే ఇద్దరు నేతలు ఒకేసారి ఆ శుభకార్యానికి హాజరయ్యారు. ఇరువురు నేతలూ పరస్పరం తారసపడగా.. ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇరువురు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పలువురిని ఎమ్మెల్సీ కవిత.. బండి సంజయ్‌ కుమార్‌కు పరిచయం చేశారు. బండి సంజ‌య్ కూడా క‌విత‌కు ప‌క్క‌నున్న వారిని ఇంట్ర‌డ్యూస్ చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Updated On 31 May 2023 5:52 AM GMT
Ehatv

Ehatv

Next Story