తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. తెలంగాణ చిహ్నంలోని చార్మినార్, కాకతీయ కళాతోరణం గుర్తులను తొలగించేందుకు సీఎం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీఎంకు ఇంకా టీడీపీ నుంచి వచ్చిన లక్షణాలు పోయినట్టు లేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాష, యాస, వ్యవసాయం, చరిత్రను తుడిచేయాలని ఆంధ్రా పాలకులు భావించారని, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా వాళ్లలాగానే ఆలోచిస్తున్నాడని విమర్శించారు.

చార్మినార్, కాకతీయ కళాతోరణం రాచరికపు చిహ్నాలంటూ ముఖ్యమంత్రి పీఠం నుంచి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం దేన్ని సూచిస్తోందని వినోద్ కుమార్ ప్రశ్నించారు. 11, 12 శతాబ్దాల్లో దక్షిణ భారతదేశ పాలకులుగా ఖ్యాతి గడించిన కాకతీయులు రాచరికం నుంచి వచ్చిన వాళ్లు కాదని స్పష్టం చేశారు. వారు పేదల కోసం పాటుపడిన మహనీయులు అని కొనియాడారు. కాకతీయుల ఘనచరిత్రకు నిలువెత్తు నిదర్శనం కాకతీయ కళాతోరణం అని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక సారనాథ్ స్థూపం నుంచి 3 సింహాల గుర్తును, అశోక చక్రం చిహ్నాలను భారతదేశ అధికారిక చిహ్నంలోకి తీసుకున్నారని, అవి రాచరిక వ్యవస్థకు సంకేతాలు కాదా అని వినోద్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా ఉండాలని.. ఎవరో చెప్పిన వాటిని విని ఈ విధంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.

Updated On 11 Feb 2024 9:18 PM GMT
Yagnik

Yagnik

Next Story