బీజేపీ ఖచ్చితంగా 8 నుండి 10 ఎంపీ స్థానాలు గెలుస్తుందని బీజేపీ ఎమ్మెల్యే యేలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సెక్రటేరియట్ వ‌ద్ద మీడియాతో చిట్ చాట్‌లో ఆయ‌న మాట్లాడుతూ..

బీజేపీ ఖచ్చితంగా 8 నుండి 10 ఎంపీ స్థానాలు గెలుస్తుందని బీజేపీ ఎమ్మెల్యే యేలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సెక్రటేరియట్ వ‌ద్ద మీడియాతో చిట్ చాట్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, జహీరాబాద్ లోక్‌స‌భ స్థానాలు బీజేపీ గెలుస్తుంద‌ని.. భువనగిరి, వరంగల్ టఫ్ ఫైట్ ఉంది.. నాగర్ కర్నూల్ కూడా ఛాన్స్ ఉంది. అది కూడా వస్తే 11 స్థానాలు అవుతాయన్నారు.

ఈ ఎన్నిక‌ల‌లో మోదీ చరిష్మా పనిచేసిందన్నారు. కాంగ్రెస్ డబ్బులు పంచింది.. అదే వారికి మైనస్ అయ్యింద‌న్నారు. మేము అక్షింతలు వేశాం.. జై శ్రీరాం అన్నాం అన్నారు. సంవత్సరమో, రెండు.. మూడు యేళ్లకో.. ఎప్పటికైనా బీజేపీ తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు. కోమటి రెడ్డితో నాకు మాటలు లేవు.. 15 ఏళ్లుగా మాట్లాడటం లేదన్నారు. కాంగ్రెస్ లో పరిస్థితి నాకు తెలియంది కాదని అంత‌ర్గత వ్య‌వ‌హారాల‌పై మాట్లాడారు.

Updated On 18 May 2024 9:12 AM GMT
Yagnik

Yagnik

Next Story