మెడమీద తలకాయ ఉన్నవారెవ్వరూ బీఆర్‌ఎస్‌తో(BRS) పొత్తు పెట్టుకోరని బీజేపీ(BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్‌కుమార్‌(Bandi sanjay Kumar) వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ మునిగిపోయే నావ అని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. దేశవ్యాప్తంగా 400 సీట్లు బీజేపీకి రాబోతున్నాయని, ఒక్కసీటు రాని బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు.

మెడమీద తలకాయ ఉన్నవారెవ్వరూ బీఆర్‌ఎస్‌తో(BRS) పొత్తు పెట్టుకోరని బీజేపీ(BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్‌కుమార్‌(Bandi sanjay Kumar) వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ మునిగిపోయే నావ అని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. దేశవ్యాప్తంగా 400 సీట్లు బీజేపీకి రాబోతున్నాయని, ఒక్కసీటు రాని బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నారని తెలుసుకున్న కేసీఆర్ పొత్తు పేరుతో డ్రామాలాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్ పార్టీలు రెండూ బహిరంగ మిత్రులేనని, గతంలోనూ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్ధిని ఓడించేందుకు కుట్ర చేశాయని ఆరోపించారు. ప్రజాహిత తొలిదశ యాత్ర ముగింపు సందర్భంగా సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో బండి సంజయ్ మీడియాతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిసారి బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ నేతలంతా ఆ పార్టీని వీడిపోతున్నారని తెలిసి కేసీఆర్ ఈ డ్రామాలాడుతున్నారని బండి సంజయ్‌ తెలిపారు. నిజానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకమని చెప్పారు. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలు చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుసుకునే కేసీఆర్‌ ఈ డ్రామాకు తెరతీశారని అన్నారు. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు బహిష్కరించబోతున్నరని, ఈ విషయం తెలిసే సోనియాగాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ్యసభకు వెళుతున్నారని బండిసంజయ్‌ వ్యాఖ్యానించారు.

Updated On 15 Feb 2024 7:23 AM GMT
Ehatv

Ehatv

Next Story