హైద్రాబాద్‌లో(Hyderabad) దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. మైనర్ బాలుడిని(Minor boy) గుర్తు తెలియని వ్య‌క్తులు దారుణంగా హత్య చేశారు. వివ‌రాళ్లోకెళితే.. మైలార్‌దేవుపల్లిలోని(Mailardevupalli ) లక్ష్మిగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో మైనర్ బాలుడిని గుర్తు తెలియని వ్య‌క్తులు కత్తితో గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు.

హైద్రాబాద్‌లో(Hyderabad) దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. మైనర్ బాలుడిని(Minor boy) గుర్తు తెలియని వ్య‌క్తులు దారుణంగా హత్య చేశారు. వివ‌రాళ్లోకెళితే.. మైలార్‌దేవుపల్లిలోని(Mailardevupalli ) లక్ష్మిగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో మైనర్ బాలుడిని గుర్తు తెలియని వ్య‌క్తులు కత్తితో గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు. బాలుడు మృతదేహాన్ని చూసిన‌ స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివ‌రాలు సేక‌రించారు. మృతుడిని బీహార్(Bihar) కు చెందిన రాజా పాశ్వాన్(Pashwan)(17)గా గుర్తించారు. రాజా పాశ్వాన్ 3 నెలల క్రితమే నగరానికి వలస వచ్చినట్లు తెలిపారు. పాత గొడ‌వ‌లే హ‌త్య‌కు కార‌ణ‌మై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

Updated On 27 Aug 2023 1:40 AM GMT
Ehatv

Ehatv

Next Story