వెంకటేశ్వర్లు ఆయుర్వేద డాక్టరుగా పని చేశారు. హోమియో ఎండీ చదివిన మల్లు వెంకటేశ్వర్లు ఆయుష్ శాఖలో

తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు భట్టి వెంకటేశ్వర్లు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న వెంకటేశ్వర్లు హైదరాబాద్‌ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వైరాకు వెంకటేశ్వర్లు భౌతిక కాయాన్ని తరలిస్తున్నారు. తన సోదరుడు వెంకటేశ్వర్లు మరణ వార్త తెలియగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్‌ నుంచి వైరాకు బయలుదేరి వెళ్లారు. ఆయన షెడ్యూల్‌ ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో సోదరుడు వెంకటేశ్వర్లు మరణించడంతో స్వగ్రామానికి బయల్దేరారు.

వెంకటేశ్వర్లు ఆయుర్వేద డాక్టరుగా పని చేశారు. హోమియో ఎండీ చదివిన మల్లు వెంకటేశ్వర్లు ఆయుష్ శాఖలో ప్రొఫెసర్‌గా, అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అనంతరం వైరాలోని 1వ వార్డులో ఉన్న తన నివాసంలో హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. మల్లు వెంకటేశ్వర్లకు హోమియో వైద్యంలో ఎంతో మంచి పేరు ఉంది. అతని వద్ద వైద్యం చేయించుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. గత మూడు నెలలుగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించటంతో ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన్ను జాయిన్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనకు గత మూడు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Updated On 12 Feb 2024 11:08 PM GMT
Yagnik

Yagnik

Next Story