యాదాద్రి(Yadadri) మళ్లీ యాదగిరిగుట్ట(Yadagirigutta) కాబోతున్నది. త్వరలో యాదగిరిగుట్టగా పేరు మారుస్తామని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(Beerla Ilaiah) తెలిపారు. కొబ్బరికాయ కొట్టే స్థలాన్ని ప్రారంభిస్తూ ఆయన ఈ మాట చెప్పారు.

యాదాద్రి(Yadadri) మళ్లీ యాదగిరిగుట్ట(Yadagirigutta) కాబోతున్నది. త్వరలో యాదగిరిగుట్టగా పేరు మారుస్తామని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(Beerla Ilaiah) తెలిపారు. కొబ్బరికాయ కొట్టే స్థలాన్ని ప్రారంభిస్తూ ఆయన ఈ మాట చెప్పారు. ఈ ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM revanth reddy) ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. త్వరలో ఆయన క్షేత్ర సందర్శనకు రానున్నట్లు బీర్ల అయిలయ్య తెలిపారు. నెల రోజుల్లోగా సమీక్ష సమావేశం నిర్వహిస్తానని, యాదగిరిగుట్ట క్షేత్రానికి పూర్వ సంప్రదాయం చేకూర్చేలా కృషి చేస్తానని అన్నారు. కొండపై డార్మిటరీ హాల్‌ నిర్మించి భక్తులు నిద్ర చేసే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. శతాబ్దాలుగా ఈ క్షేత్రాన్ని యాదగిరిగుట్టగా వ్యవహరిస్తున్నారని, పేరు మార్చడం సరికాదని విప్‌ తెలిపారు.

Updated On 2 March 2024 1:35 AM GMT
Ehatv

Ehatv

Next Story