అన్నా.. వస్తున్నా.. అడుగులో అడుగేస్తా.. చేతిలో చెయ్యేస్తా.. కాంగ్రెస్ కోసం.. పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నా జై కాంగ్రెస్.. జైజై కాంగ్రెస్’’ అంటూ ట్వీట్ చేసిన‌ బండ్ల గణేశ్.. భట్టి విక్రమార్కను క‌లిశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో బండ్ల గణేశ్ పాల్గొన్నారు.

అన్నా.. వస్తున్నా.. అడుగులో అడుగేస్తా.. చేతిలో చెయ్యేస్తా.. కాంగ్రెస్ కోసం.. పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నా జై కాంగ్రెస్.. జైజై కాంగ్రెస్’’ అంటూ ట్వీట్ చేసిన‌ బండ్ల గణేశ్.. భట్టి విక్రమార్కను క‌లిశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో బండ్ల గణేశ్ పాల్గొన్నారు. భట్టి యాత్ర‌కు సంఘీభావం ప్రకటించారు.

అనంత‌రం బండ్ల గణేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తుఫాన్ వస్తోంది.. కర్ణాటక నుంచి స్టార్ అయింది.. తర్వాత తెలంగాణను కొట్టుకుని, ఢిల్లీదాకా వెళ్లుంది. ఢిల్లీ గ‌ద్దెపై జెండా ఎగురవేస్తాం.. క‌ప్పు కొడుతున్నాం” అని త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో 150 రోజుల్లో తమ ప్రభుత్వం వస్తుందని బండ్ల గణేశ్ జోష్యం చెప్పారు. గొప్పలు చెప్పుకోం.. డబ్బాలు కొట్టుకోం.. ప్రకటనలు ఇవ్వం.. సినిమాలు తియ్యం.. ప్రజా సేవ చేస్తాం. తక్కవ మాట్లాడుతాం.. ఎక్కు వ పని చేస్తామ‌ని వ్యాఖ్యానించారు. ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేసే వాళ్ల పరిపాలన ఇక్కడ చూస్తున్నారని అధికార‌ బీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌నాస్త్రం సంధించారు. భట్టి లాంటి నాయకుడికి మద్దతు తెలపడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తామంతా కలిసి పోరాడతామ‌న్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కప్పు కొడుతుందని.. అందుకు ప్ర‌జ‌లంద‌రి సహకారాలు కావాలని కోరారు.

Updated On 26 Jun 2023 2:53 AM GMT
Ehatv

Ehatv

Next Story