సినీ నటుడు, ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించారు. హనుమకొండ జిల్లా ములుగు రోడ్డులోని శ్రీసాయి కన్వెన్షన్ హాల్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయ‌న‌ మాట్లాడుతూ..

సినీ నటుడు, ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించారు. హనుమకొండ జిల్లా ములుగు రోడ్డులోని శ్రీసాయి కన్వెన్షన్ హాల్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయ‌న‌ మాట్లాడుతూ.. తాను వరంగల్ లోనే పుట్టాన‌ని పేర్కొన్నారు. ఈ నగరంతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. వరంగల్ కు ఎప్పుడు వచ్చినా తన అడ్డా కరుణపురం అని చెప్పారు. ప్రజాశాంతి పార్టీ నుంచే తాను ఎంపీగా పోటీ చేస్తానని బాబూ మోహన్ తెలిపారు. తాను వేరే పార్టీ నుంచి పోటీ చేస్తానని కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. చీప్ రాజకీయాలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా తాను తొలిసారి కరుణాపురం చర్చికి వ‌చ్చాన‌ని తెలిపారు. .

వరంగల్ ప్రజలు తనను గెలిపించాలని.. అందరూ శెభాష్ అనేలా ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాదిరి ప్ర‌జాశాంతి అధినేత కేఏ పాల్ అబద్ధాలు చెప్పరని అన్నారు. టికెట్ ఇస్తామని చెప్పి బీజేపీ నేతలు మోసం చేశారని విమర్శించారు. తాను గెలిచిన తర్వాత పేదలందరికీ పింఛన్లు ఇప్పిస్తానని చెప్పారు. ఉచిత విద్య, వైద్యం ఇప్పిస్తానని అన్నారు.

Updated On 1 April 2024 6:15 AM GMT
Yagnik

Yagnik

Next Story