నాగర్‌కర్నూలు(Nagar Kurnool) జిల్లా చారకొండ విషాదం చోటు చేసుకుంది. తోటి విద్యార్థినులు వేధిస్తున్నారని విద్యార్థిని మనస్తాపం చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు(Suicide) పాల్పడింది. సీఐ సోమనర్సయ్య వెల్లడించిన వివరాల ప్రకారం.. చారకొండ మండల కేంద్రానికి చెందిన అనూష (23)(Anusha) రంగారెడ్డి జిల్లా శేరిగూడలోని ఓ ప్రైవేట్‌ కాలేజ్‌లో బీఫార్మసీ థర్డ్‌ ఇయర్‌ చదువుతోంది.

నాగర్‌కర్నూలు(Nagar Kurnool) జిల్లా చారకొండ విషాదం చోటు చేసుకుంది. తోటి విద్యార్థినులు వేధిస్తున్నారని విద్యార్థిని మనస్తాపం చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు(Suicide) పాల్పడింది. సీఐ సోమనర్సయ్య వెల్లడించిన వివరాల ప్రకారం.. చారకొండ మండల కేంద్రానికి చెందిన అనూష (23)(Anusha) రంగారెడ్డి జిల్లా శేరిగూడలోని ఓ ప్రైవేట్‌ కాలేజ్‌లో బీఫార్మసీ థర్డ్‌ ఇయర్‌ చదువుతోంది. మంగళ్‌పల్లిలోని ఓ హాస్టల్‌లో(Hostel) ఉంటూ కాలేజ్‌కు వెళ్లి వచ్చేది. అటు కాలేజ్‌లో, ఇటు హాస్టల్‌లో తనతో ఉంటున్న తోటి విద్యార్థులు వేధిస్తున్నారని తన సోదరుడు విజేందర్‌గౌడ్‌కు చెప్పి బాధపడింది. దీంతో ఆదివారం అనూషను స్వగ్రామంలోని ఇంటికి సోదరుడు తీసుకెళ్లాడు. సోమవారం ఉదయం అనూష్ తల్లిదండ్రులు(Parents), సోదరుడు పొలానికి వెళ్లిపోయారు. సోదరుడు విజేందర్‌గౌడ్‌ తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అనూష్‌ తండ్రి యాదయ్యగౌడ్‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Updated On 19 Dec 2023 8:31 AM GMT
Ehatv

Ehatv

Next Story