రంగారెడ్డి జిల్లా(Ranga Reddy) మహేశ్వరం (Maheswaram)మండలం కేసీ తండాకు చెందిన 45 ఏళ్ల జతావత్‌ ప్రభు ఆటో నడుపుతూ సంసారాన్ని నెట్టుకొస్తుండేవాడు. రెండేళ్ల కిందట అల్మాస్‌గూడ వినాయకహిల్స్‌లో ఉంటున్న కొర్ర జయరామ్‌కు తన కూతురు స్వాతిని ఇచ్చి పెళ్లి చేశారు. కొంతకాలంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

రంగారెడ్డి జిల్లా(Ranga Reddy) మహేశ్వరం (Maheswaram)మండలం కేసీ తండాకు చెందిన 45 ఏళ్ల జతావత్‌ ప్రభు ఆటో నడుపుతూ సంసారాన్ని నెట్టుకొస్తుండేవాడు. రెండేళ్ల కిందట అల్మాస్‌గూడ వినాయకహిల్స్‌లో ఉంటున్న కొర్ర జయరామ్‌కు తన కూతురు స్వాతిని ఇచ్చి పెళ్లి చేశారు. కొంతకాలంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం కూతురును పలకరించివద్దామనుకుని భార్య శాంతితో కలిసి ప్రభు వినాయకహిల్స్‌లో ఉన్న అల్లుడి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో కూతురు స్వాతి, ఆమె అత్త లలిత (50) గొడవపడుతుండగా ప్రభు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. ఆగ్రహానికి గురైన ప్రభు పక్కనే ఉన్న ఇనుప సుత్తెతో లలితపై దాడి చేశాడు. ఆమెకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ప్రభును అరెస్ట్ చేశారు.

Updated On 5 Jun 2024 1:58 AM GMT
Ehatv

Ehatv

Next Story