పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీను(38) మృతి చెందారు

పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీను(38) మృతి చెందారు. పోలీస్ ఉన్నధికారులు, కిందిస్థాయి సిబ్బంది వేధింపులు, కులవివక్ష వేధింపులను భరించలేని శ్రీరాములు.. జూన్ 30వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విష‌యం గుర్తించిన శ్రీరాములు.కుటుంబ‌స‌భ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ప‌రిస్తితి విష‌మించ‌డంతో ఆదివారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు.

శ్రీరాములు శ్రీనుకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని పేర్కొంటూ శ్రీరాములు శ్రీను భార్య కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన ఉన్న‌తాధికారులు.. సీఐ జితేందర్ రెడ్డి, పోలీస్ కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, సుభాని, శేఖర్, శివనాగురాహులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది. ఎస్ఐ శ్రీరాములు శ్రీను మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Eha Tv

Eha Tv

Next Story