సికింద్రాబాద్(Secunderabad)ఉజ్జ‌యిని మహంకాళి బోనాల(Ujjain Mahankali Bonalu) ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ఆకాష్ సింగ్ (Akash singh)(27) అనే యువకుడు విద్యుత్ షాక్(Electric shock) తగిలి మృత్యువాత ప‌డ్డాడు. కార్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాశ్ సింగ్.. బేగంబజార్(Begambazar) లో సేల్స్ మాన్(Sales man) గా పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి సమయంలో ఆకాష్ సింగ్..

సికింద్రాబాద్(Secunderabad)ఉజ్జ‌యిని మహంకాళి బోనాల(Ujjain Mahankali Bonalu) ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ఆకాష్ సింగ్ (Akash singh)(27) అనే యువకుడు విద్యుత్ షాక్(Electric shock) తగిలి మృత్యువాత ప‌డ్డాడు. కార్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాశ్ సింగ్.. బేగంబజార్(Begambazar) లో సేల్స్ మాన్(Sales man) గా పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి సమయంలో ఆకాష్ సింగ్.. అమ్మవారి దర్శనానికి వచ్చిన సమయంలో వర్షం కురుస్తుంది. అనుకోకుండా ఆకాష్కు కరెంట్ పోల్ తగల‌డంతో.. ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మరణించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి(Gandhi Mortuary) తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే.. అమ్మవారి దర్శనానికి వెళ్ళిన వ్య‌క్తి తిర‌గిరాని లోకానికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విద్యుత్ శాఖ నిర్ల‌క్ష్యంపై భ‌క్తులు మండిప‌డుతున్నారు.

Updated On 10 July 2023 12:34 AM GMT
Ehatv

Ehatv

Next Story