హైదరాబాద్‌లో భారీ ఎత్తున డ్రగ్స్‌ను పట్టుకున్నారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్స్‌ బ్యూరో, రాజేంద్రనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు జరిపిన జాయింట్‌ ఆపరేషన్‌లో భారీ మొత్తంలో డ్రగ్స్‌ పట్టుబడింది.

హైదరాబాద్‌లో భారీ ఎత్తున డ్రగ్స్‌ను పట్టుకున్నారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్స్‌ బ్యూరో, రాజేంద్రనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు జరిపిన జాయింట్‌ ఆపరేషన్‌లో భారీ మొత్తంలో డ్రగ్స్‌ పట్టుబడింది. డ్రగ్స్‌ అమ్ముతున్న అయిదుగురు నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు కోట్ల రూపాయల విలువ చేసే 200 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సోదరుడు అమన్‌ ప్రీత్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. డ్రగ్స్‌ తీసుకుంటుండగా అమన్‌ను పోలీసులు పట్టుకున్నారు. నైజీరియన్ల నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసిన అయిదుగురు ప్రముఖులను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల అదుపులో సీని రంగ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉన్నారట!

Eha Tv

Eha Tv

Next Story