గాంధీ భ‌వ‌న్‌(Gandhi Bahvan)లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నీతి, నిజాయతిగా ప్రజలకోసం పనిచేస్తున్న కాంగ్రెస్ లో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ లో చేరాన‌ని తెలిపారు. విజయశాంతి కూడా కాంగ్రెస్ లో చేరారన్నారు. ప్రతి పేద వాడు బాగుపడాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే నియంత పాలకులను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు.

విజన్ కలిగిన టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) దగ్గర గతంలో పని చేయడం ఆనందంగా వుందని.. అయితే.. కొన్ని కారణాల వల్ల పార్టీ నుంచి బయటికి వచ్చానని సినీ న‌టి దివ్యవాణి(Actress Divyavani) తెలిపారు. ఆమె బుధ‌వారం కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే దివ్యవాణికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గాంధీ భ‌వ‌న్‌(Gandhi Bahvan)లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నీతి, నిజాయతిగా ప్రజలకోసం పనిచేస్తున్న కాంగ్రెస్ లో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ లో చేరాన‌ని తెలిపారు. విజయశాంతి కూడా కాంగ్రెస్ లో చేరారన్నారు. ప్రతి పేద వాడు బాగుపడాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే నియంత పాలకులను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. అహంకార ప్రభుత్వంలో బానిస బ్రతుకుల నుండి బయట పడేందుకు కాంగ్రెస్ రావాలన్నారు. ప్రజల భవిష్యత్తును కాపాడేది, దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ మాత్రమేన‌న్నారు. కార్యకర్తగా తనకు ఏ పని అప్పగించినా బాధ్యతగా పనిచేస్తాన‌ని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో నచ్చిన అంశం ప్రగతి భవన్ కాదిది.. ప్రజాభవన్ అని ప్రకటించడం అన్నారు.

Updated On 22 Nov 2023 5:33 AM GMT
Ehatv

Ehatv

Next Story