రూ.50 వేల లంచం(Bribe) తీసుకుంటూ కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య ఏసీబీకి చిక్కారు. కేయూలో కీలక బాధ్యతల్లో ఏ.ఆర్. కిష్టయ్య పనిచేస్తున్నారు. ఏ.ఆర్ కిష్టయ్యను ఈ మధ్యనే ఆర్ట్స్ కాలేజీ(Arts College) నుంచి క్యాంపస్‌కు వీసీ ప్రో.రమేష్ బదిలీ చేయించుకున్నారు. విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుముల స్వీకరణలో జరిగిన రూ. 3 కోట్ల కుంభకోణంపై కిష్టయ్య, ప్రిన్సిపాల్ బన్న అయిలయ్యపై విచారణ కమిటీ ఉండగానే ఏ.ఆర్ కిష్టయ్యను క్యాంపస్‌కు మార్చిన వీసీ రమేష్. న్యాక్ కొరకు కేటాయించిన రూ.10 కోట్ల బిల్లులపై చేతి వాటం కోసమే కిష్టయ్యను క్యాంపస్ కు వీసీ రమేష్ బదిలీ చేయించారని గతంలో ఆరోపణలు వచ్చాయి.

రూ.50 వేల లంచం(Bribe) తీసుకుంటూ కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య ఏసీబీకి(ACB) చిక్కారు. కేయూలో కీలక బాధ్యతల్లో ఏ.ఆర్. కిష్టయ్య పనిచేస్తున్నారు. ఏ.ఆర్ కిష్టయ్యను ఈ మధ్యనే ఆర్ట్స్ కాలేజీ(Arts College) నుంచి క్యాంపస్‌కు వీసీ ప్రో.రమేష్ బదిలీ చేయించుకున్నారు. విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుముల స్వీకరణలో జరిగిన రూ. 3 కోట్ల కుంభకోణంపై కిష్టయ్య, ప్రిన్సిపాల్ బన్న అయిలయ్యపై విచారణ కమిటీ ఉండగానే ఏ.ఆర్ కిష్టయ్యను క్యాంపస్‌కు మార్చిన వీసీ రమేష్. న్యాక్ కొరకు కేటాయించిన రూ.10 కోట్ల బిల్లులపై చేతి వాటం కోసమే కిష్టయ్యను క్యాంపస్ కు వీసీ రమేష్ బదిలీ చేయించారని గతంలో ఆరోపణలు వచ్చాయి.

యూనివర్సిటీలో కీలకమైన నాలుగు కార్యాలయాలకు కిష్టయ్యను ఒక్కడినే అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా వీసీ నియమించారు. న్యాక్(NAAC) సందర్భంగా కాకతీయవర్సిటీలో రోడ్లు, హాస్టళ్లు, ఇతర బిల్డింగ్‌ల కోసం రూ.10 కోట్ల కేటాయించారు. ఇందులో కమీషన్ల కొరకే బిల్డింగ్ డివిజన్, పబ్లికేషన్స్ సెల్, హాస్టల్ ఆఫీస్‌లతో పాటు యూనివర్సిటీ ఆడిట్ ఆఫీస్‌కు కూడా కిష్టయ్యనే అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా నియమించారు. హాస్టల్‌లోనే ఓ పాలు అమ్మే వ్యాపారి దగ్గరి నుంచి రూ.50 వేలు లంచం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇంకా దీని వెనుక వీసీ రమేష్ లాంటి పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయనే రీతిలో ఏసీబీ విచారణ జరుపుతుంది

Updated On 5 Jan 2024 4:47 AM GMT
Ehatv

Ehatv

Next Story