ఖమ్మం(Khammam) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కొణిజర్ల(Konizarla) మండల కేంద్రం సమీపంలోని పెట్రోల్బంకు ఎదురుగా లారీ, కారు ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఖమ్మం(Khammam) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కొణిజర్ల(Konizarla) మండల కేంద్రం సమీపంలోని పెట్రోల్బంకు ఎదురుగా లారీ, కారు ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వ్యక్తిని అంబులెన్స్లో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతులను పారుపల్లి రాజేష్(Parupalli Rajesh), సుజాత(Sujatha), వీరి కుమారుడు అశ్విత్(ashwith)(13)గా గుర్తించారు. మృతులది వైరా మండలం విప్పలమడక గ్రామం. హైదరాబాద్లో ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో రాజేష్ ఉద్యోగి. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.