సికింద్రాబాద్(Secunderabad) బోయిన్ పల్లి(Boyne Palli) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. న్యూ బోయిన్‌ప‌ల్లి లోని నూతన్ కాలనీలో(Nuthan Colony) భార్యను భర్త అతి దారుణంగా కత్తితో నరికి చంపాడు. గత కొంత‌కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జ‌రుగుతున్నాయి. దీంతో భార్య ఝాన్సీ లక్ష్మిపై(Jansi Lakshmi) భర్త సత్యనారాయణ కోపం పెంచుకున్నాడు.

సికింద్రాబాద్(Secunderabad) బోయిన్ పల్లి(bowenpally ) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. న్యూ బోయిన్‌ప‌ల్లి లోని నూతన్ కాలనీలో(Nuthan Colony) భార్యను భర్త అతి దారుణంగా కత్తితో నరికి చంపాడు. గత కొంత‌కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జ‌రుగుతున్నాయి. దీంతో భార్య ఝాన్సీ లక్ష్మిపై(Jansi Lakshmi) భర్త సత్యనారాయణ కోపం పెంచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే భార్య బోయిన్‌ప‌ల్లి లో బంధువుల ఇంటికి వెళ్లిన విషయం తెలుసుకున్న సత్యనారాయణ.. అక్క‌డ‌కు చేరుకుని ఆమెతో గొడవకు దిగాడు. ఈ సమయంలో బంధువులు అడ్డగించగా వెంట తెచ్చుకున్న కత్తితో భార్యను విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచాడు. అడ్డువచ్చిన మహిళపై కూడా దాడి చేశాడు.

ఈ దాడిలో స‌త్య‌నారాయ‌ణ భార్య ఝాన్సీ అక్కడిక్క‌డే మృతిచెందగా.. గాయపడ్డ మహిళను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సత్యనారాయణ(Sathyanarayana) స్వస్థలం అమలాపురం. అతనిపై గతంలో కూడా హత్యా నేరం కింద కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ.. మద్యానికి బానిసై భార్యతో కొంతకాలంగా గొడవ పడుతున్నాడు. దీంతో విసుగుచెందిన‌ ఝాన్సీ.. బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకొని సత్యనారాయణ అక్క‌డ‌కు వెళ్లి ఆమెను హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సత్యనారాయణ పరారీలో ఉన్నాడు.

Updated On 15 July 2023 6:23 AM GMT
Ehatv

Ehatv

Next Story