ఓ వ్యక్తి వావివరుసలు మరిచాడు. కూతురిపై లైంగికదాడికి ఓ మారు తండ్రి పాల్పడ్డాడు. చందానగర్‌ (ChandaNagar) ఆర్టీసీ కాలనీకి (RTC Colony) చెందిన కృష్ణారావుతో (KrishnaRao) ఓ మహిళకు 2016లో రెండో పెళ్లి జరిగిందవి. అప్పటికే ఆమెకు కూతురు, కొడుకు ఉన్నా కృష్ణారావు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మంచిగా చూసుకుంటానని నమ్మబలికాడు.

ఓ వ్యక్తి వావివరుసలు మరిచాడు. కూతురిపై లైంగికదాడికి ఓ మారు తండ్రి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని చందానగర్‌ (ChandaNagar) ఆర్టీసీ కాలనీకి (RTC Colony) చెందిన కృష్ణారావుతో (KrishnaRao) ఓ మహిళకు 2016లో రెండో పెళ్లి జరిగిందవి. అప్పటికే ఆమెకు కూతురు, కొడుకు ఉన్నా కృష్ణారావు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మంచిగా చూసుకుంటానని నమ్మబలికాడు. తనకూ ఓ తోడు కావాలనుకుని అతడిని ఆమె పెళ్లాడింది. వీరిద్దరి కాపురం కొన్నాళ్లు బాగానే సాగినప్పటికీ ఇద్దరి మధ్య గొడవలు రావడంతో దూరంగా ఉంటున్నారు. అయినా మాట్లాడుకోవడం మానలేదు. అప్పటికే ఆమె కూతురుపై ఈ కామాంధుడు కన్నేశాడు.

నటనపై కూతురుకు ఉన్న ఆసక్తిని ఆసరగా చేసుకున్నాడు. హాట్‌స్టార్‌ (Hot Star) వెబ్‌సిరీస్‌లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. డైరెక్టర్‌ను కలవాలని చెప్పి కూతురుకు చెప్పాడు. ఫిబ్రవరి 1న ఆమెకు ఫోన్‌ చేసి సాయంత్ర ఆడిషన్స్ జరుగుతున్నాయని అమీర్‌పేట ఓయో (Ameerpet Oyo)లాడ్జిలో డైరెక్టర్‌ ఉన్నాడని చెప్పాడు. అదేరోజు సాయంత్రం కూతురును ఓయో లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత డైరెక్టర్‌ లేకపోయేసరికి కూతురు నిలదీసింది. టీ తాగేందుకు డైరెక్టర్‌ బయటకువెళ్లాడని వస్తాడని చెప్పి గది తలుపులు పెట్టాడు. వెంటనే తన బట్టలు విప్పుకుని నగ్నంగా మారిన తండ్రిని చూసి ఆమె బతిమిలాడింది. నా జీవితాన్ని పాడు చేయకని వేడుకున్నది. అయినా ఆమెను బలాత్కారం చేసేందుకు విఫలయత్నం చేశాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. తప్పించుకునే క్రమంలో బాత్‌రూంలోకి వెళ్లిన యువతి.. డోర్ లాక్‌ చేసుకొని 100కు డయల్ చేసింది. ఆ తర్వాత తల్లికి ఫోన్‌ చేసి చెప్పింది.

దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న తల్లి తన కన్న కూతురును చూసి బోరున విలపించింది. ఆవేశంతో తన భర్తపై కొడుకుతో కలిసి దాడి చేసింది. ఈ క్రమంలో కృష్ణారావు కూడా వారిద్దరిపై దాడికి దిగాడు. కుమారుడిని కొట్టి అతని ప్లాస్టిక్‌ కాలును విరగ్గొట్టాడు. అంతేకాకుండా తనపై మహిళ, ఆమె కొడుకు దాడి చేశాడని పోలీసులకు ఎదురు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కృష్ణారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణారావు ఫిర్యాదుతో మహిళ, కుమారుడిపై కేసు నమోదు చేశారు. వైద్యపరీక్షల నిమిత్తం బాధితురాలుని ఆస్పత్రికి తరలించారు.

Updated On 2 Feb 2024 11:10 PM GMT
Ehatv

Ehatv

Next Story