ఖమ్మం(Khammam) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య(suicides) చేసుకున్నారని పోలీసులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పెనుబల్లి(Penuballi) మండలం పాత కారాయిగూడెం(Patha Karai Gudem) గ్రామంలో చెట్టుకు వేలాడుతున్న దంపతులు, కుమార్తె మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఖమ్మం(Khammam) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య(suicides) చేసుకున్నారని పోలీసులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పెనుబల్లి(Penuballi) మండలం పాత కారాయిగూడెం(Patha Karai Gudem) గ్రామంలో చెట్టుకు వేలాడుతున్న దంపతులు, కుమార్తె మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను పి.కృష్ణయ్య (P.Krishnaiah)(40), ఆయన భార్య సుహాసిని(suhasini) (35), కుమార్తె అమృత(amrutha) (19)గా గుర్తించారు.

సుహాసిని ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే కుటుంబం ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అనారోగ్య సమస్యలతో మనస్థాపానికి గురైన దంపతులు, వారి కుమార్తె మామిడితోటలోని చెట్టుకు ఉరివేసుకున్నారు. పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసామని.. తదుపరి దర్యాప్తును ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

Updated On 23 Jun 2023 3:50 AM GMT
Ehatv

Ehatv

Next Story