కాసేపట్లో పెళ్లి..పందిట్లో పెళ్లి సందడి మొదలైంది. చుట్టాలు పక్కాలు వచ్చేశారు..బాజా భజంత్రీలు మోగుతున్నాయి.. పెళ్లికోసం ముస్తాబవుతున్న పెళ్లి కూతరు..ఉన్నట్టుండి కనిపించకుండాపోయింది. అప్పటి వరకు కనిపించిన పెళ్లి సందడి ఒక్కసారిగా ఆగిపోయింది. బాజా భజంత్రీలు మూగపోయాయి.

కాసేపట్లో పెళ్లి..పందిట్లో పెళ్లి సందడి మొదలైంది. చుట్టాలు పక్కాలు వచ్చేశారు..బాజా భజంత్రీలు మోగుతున్నాయి.. పెళ్లికోసం ముస్తాబవుతున్న పెళ్లి కూతరు..ఉన్నట్టుండి కనిపించకుండాపోయింది. అప్పటి వరకు కనిపించిన పెళ్లి సందడి ఒక్కసారిగా ఆగిపోయింది. బాజా భజంత్రీలు మూగపోయాయి.అసలు ఏం జరిగిందని ఆరాతీసేలోపే స్వయాన అక్క భర్తతో పెళ్లికూతురు లేచిపోయిందని తెలిసింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది?

వివరాల్లోకి వెళ్లితే..తెలంగాణలోని జగిత్యాల(Jagithyala) జిల్లా కన్నాపూర్ కు(Kannapur) చెందిన యువతికి, లంబాడిపల్లికి చెందిన యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. పెద్దలు కుదిర్చిన ముహూకర్తం ప్రకారం ఆదివారం నాడు పెళ్లి తంతు జరగాల్సి ఉంది. మరికాసేపట్లో పెళ్లి పీటలపై ఎక్కాల్సిన పెళ్లికూతురు(bride) ఆకస్మాత్తుగా ఇంట్లో కనిపించకుండాపోయింది. దీంతో పెళ్లి ఆగిపోవడంతోపాటు వివాహానికి వచ్చిన అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే తేరుకొని చుట్టు పక్కల పెళ్లికూతురు కోసం తీవ్రంగా గాలించారు.

తెలిసిన ఇళ్లల్లోకి వెళ్లి వెతికారు. పెళ్లికూతురుకు స్నేహితురాళ్లకు పోన్ చేసి ఆరా తీశారు. కానీ, పెళ్లి కూతురు జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు.పెళ్లి సమయం దగ్గర పడుతున్నా ఆ పెళ్లి కూతురు రాకపోవడంతో మొత్తానికి పెళ్లి ఆగిపోయింది. ఇదే సమయంలో పెళ్లి కూతురు అక్క భర్త కూడా కనిపించలేదు. దీంతో పెళ్లి కూతరు తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఈలోపే అక్క భర్త బావతో పెళ్లి కూతురు లేచిపోయినట్లుగా అందరికీ తెలిసిపోయింది. ఈ షాకింగ్ పరిణామం నుంచి తేరుకున్న వరుడు, అతని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Updated On 8 May 2023 1:56 AM GMT
Ehatv

Ehatv

Next Story