సూర్యాపేట(Suryapet) జిల్లాలో ఘోర ప్రమాదం జ‌రిగింది. జిల్లా కేంద్రంలోని మేళ్లచెరువులోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో(Cement Factory) ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. సిమెంట్ ఫ్యాక్టరీలో నూతనంగా నిర్మిస్తున్న యూనిట్ 4 ప్లాంట్ వద్ద 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ జ‌రుగుతండ‌గా.. ఒక్కసారిగా లిఫ్ట్(Lift) కూలి కార్మికుల మీద‌ పడింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా..

సూర్యాపేట(Suryapet) జిల్లాలో ఘోర ప్రమాదం జ‌రిగింది. జిల్లా కేంద్రంలోని మేళ్లచెరువులోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో(Cement Factory) ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. సిమెంట్ ఫ్యాక్టరీలో నూతనంగా నిర్మిస్తున్న యూనిట్ 4 ప్లాంట్ వద్ద 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ జ‌రుగుతండ‌గా.. ఒక్కసారిగా లిఫ్ట్(Lift) కూలి కార్మికుల మీద‌ పడింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయ‌పడిన కార్మికుల‌ను ఫ్యాక్టరీ సిబ్బంది వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. క్షతగాత్రులు ఉత్తర ప్రదేశ్, బీహార్ కు చెందినవారుగా తెలుస్తోంది. కార్మికులు ఉపాధి నిమిత్తం సూర్యాపేట‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న‌పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Updated On 25 July 2023 6:41 AM GMT
Ehatv

Ehatv

Next Story