మార్చి 15వ తేదీ నాటికి 100 రోజుల పాలన తెలంగాణలో పూర్తి చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం

మార్చి 15వ తేదీ నాటికి 100 రోజుల పాలన తెలంగాణలో పూర్తి చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 4 కోట్ల మంది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో శరవేగంగా దూసుకుపోతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు 100 రోజుల పాలనలో సాధించిన విజయాల గురించి ప్రస్తావిస్తూ.. ఆరు ఎన్నికల హామీలలో ఐదు ఇప్పటికే నెరవేర్చినట్లు పార్టీ తెలిపింది. నాశనమైన పరిపాలనా వ్యవస్థలను క్రమబద్ధీకరించడం ద్వారా మొదటి 100 రోజుల్లో ఐదు హామీలు ఇప్పటికే అమలు చేశామని.. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు "ప్రజాపాలన" నిర్వహించామని.. గ్రామసభలలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించామని.. ప్రభుత్వ పత్రికా ప్రకటన తెలిపింది.

కొత్త ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజున.. ఎత్తైన గోడలను కూల్చివేసి, ఇనుప ఫెన్సింగ్‌ను తొలగించి ప్రగతి భవన్‌కు విముక్తి కల్పించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. ఆ భవన్‌కు మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ అని పేరు పెట్టామని కాంగ్రెస్ ప్రభుత్వం వివరించింది. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. "ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాము. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేసింది. అర్హులైన పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించాం. 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే గృహ వినియోగదారులందరికీ జీరో విద్యుత్ బిల్లులు జారీ చేస్తున్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రూ.22,500 కోట్లతో 4,50,000 ఇళ్లను నిర్మించనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది’’ అని పార్టీ పేర్కొంది.

Updated On 14 March 2024 8:44 PM GMT
Yagnik

Yagnik

Next Story