రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నీళ్ల కుంటలో పడి 3వ‌ తరగతి విద్యార్థి శ్రీనివాస్ మృతి చెందాడు

రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నీళ్ల కుంటలో పడి 3వ‌ తరగతి విద్యార్థి శ్రీనివాస్ మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబంలో విషాద ఛాయ‌లు అల‌ముకున్నాయి. బాలుడిని తలుచుకుని త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. నిన్న ఆదివారం కావడంతో శ్రీనివాస్ ఆడుకోవడానికి బయటకు వెళ్లగా.. ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందారు.

పెద్దకుంట నీళ్లను తోడి అమ్ముకుంటున్న మాఫియా వ‌ల్లే ఇది జ‌రిగింద‌ని గ్రామ‌స్థులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. శ్రీనివాస్‌ నీళ్ల నిల్వ‌కు తోడిన గుంటలో పడ్డాడ‌ని స్థానికులు చెబుతున్నారు. నిన్నటి నుండి బాలుడు క‌న‌ప‌డ‌టం లేదు.. అత‌డి కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలోనే ఉదయం నీళ్ళ కుంటలో బాలుడి శవం ల‌భ్య‌మైంది. ఈ విష‌య‌మై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.





Sreedhar Rao

Sreedhar Rao

Next Story