☰
✕
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
x
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సిసిఎల్)లోని రామగుండం-1 ఏరియాలోని 2 ఇంక్లైన్ బొగ్గు గనిలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. రెండో షిప్టు సమయంలో బొగ్గు గని పైకప్పు కూలిపోవడంతో ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనలో జనరల్ మజ్దూర్ తుడి సంపత్ కుమార్, సపోర్టర్ రాదండి శంకర్, కార్మికుడు సత్రి నోయల్ రాజ్ గాయపడ్డారు. ఇతర కార్మికులు బొగ్గును తొలగించి వారిని రక్షించి గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరో కార్మికుడు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు.
Eha Tv
Next Story