మేడ్చల్(Medchal) జిల్లా శామీర్‌పేట్(Shamirpet) కీసర ఔటర్ రింగ్ రోడ్డు(Kisara ORR) వద్ద ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి  చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మూడు వాహనాలు అతివేగంతో ఢీ కొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

మేడ్చల్(Medchal) జిల్లా శామీర్‌పేట్(Shamirpet) కీసర ఔటర్ రింగ్ రోడ్డు(Kisara ORR) వద్ద ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మూడు వాహనాలు అతివేగంతో ఢీ కొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. శామీర్‌పేట్, కీసర మధ్యలో ఔటర్ రింగ్ రోడ్డు కిమీ 66 నెంబర్ ఎదురుగా రోడ్డు ప్రమాదం జ‌రిగింది. లారీ, టాటా ఏసీ, కారు.. అతివేగంగా ఢీకొన్నాయి. ప్ర‌మాదం ధాటికి కారు(Car), టాటా ఏసీ(Tata AC) వాహ‌నాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థలానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌ తరలించారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 17 July 2023 3:15 AM GMT
Ehatv

Ehatv

Next Story