తండ్రిని కొడుతుంటే తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కూతురు

సూర్యాపేట(Suryapet) జిల్లా నాగారం మండలం డీకొత్తపల్లి గ్రామానికి చెందిన కాసం సోమయ్యకు అదే గ్రామానికి చెందిన కడారి సైదులు, కడారి సోమయ్య, కాసం కళింగంతో గత కొన్ని రోజులుగా భూమి విషయంపై తగాదాలున్నాయి.గురువారం బోనాల పండుగ రోజు రాత్రి 10 గంటలకు సోమయ్య ఇంటికొచ్చి సైదులు, సోమయ్య, కళింగం కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సోమయ్య కాలు విరిగడంతో పాటు తల పగలగా అడ్డుకోబోయిన భార్య తలకూ గాయాలయ్యాయి. దాడి జరుగుతుంటే చూస్తున్న కూతురు పావని(14) 'నాన్నా.. మా నాన్నను వదలండి' అంటూ అడిగినా అలానే కొట్టడంతో సృహతప్పి కుప్పకూలింది. కుటుంబసభ్యులు వెళ్లిచూడగా అప్పటికే చనిపోయింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కన్న కూతురు తమ కోసం ప్రాణ త్యాగం చేయడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story