టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారతజట్టు ఆదివారం నాడు పాకిస్థాన్ తో

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారతజట్టు ఆదివారం నాడు పాకిస్థాన్ తో తలపడనుంది. అందుకు కఠోరమైన ప్రాక్టీస్ చేస్తూ ఉంది. న్యూయార్క్‌లో శుక్రవారం శిక్షణలో ఉన్నప్పుడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేతికి దెబ్బ తగిలింది. అయినప్పటికీ దానిని పట్టించుకోకుండా బ్యాటింగ్ కొనసాగించాడు. న్యూ యార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో భారత్- పాకిస్తాన్‌ల మధ్య T20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్‌కు ముందు రోహిత్ కు గాయమవ్వడం అభిమానులకు షాకిస్తోంది.

రోహిత్‌శర్మ చేతికి గాయమైన తర్వాత కూడా బ్యాటింగ్ కొనసాగించడంతో ఆటగాళ్లు, సిబ్బంది, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఓ బౌలర్ వేసిన బంతి రోహిత్ చేతి వేళ్లకు బలంగా తాకింది. దీంతో ప్రాక్టీస్‌కు కాసేపు బ్రేక్ పడింది. వెంటనే రంగంలోకి దిగిన ఫిజియోలు వైద్యం చేశారు. ఆ తర్వాత కాసేపటికే రోహిత్ మళ్లీ రోహిత్ బ్యాటింగ్ చేశాడు. రోహిత్ గాయపడడం ఇది రెండోసారి. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఆఫ్ సెంచరీ తర్వాత గాయపడడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

Updated On 8 Jun 2024 2:32 AM GMT
Yagnik

Yagnik

Next Story