భారత జట్టుకు సుదీర్ఘకాలం ఆడిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ శనివారం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

భారత జట్టుకు సుదీర్ఘకాలం ఆడిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ శనివారం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ధావన్ ఉదయం తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని ఇచ్చాడు. తాను అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు చెప్పాడు. 37 ఏళ్ల శిఖర్ ధావన్ 2010లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అతని 13 ఏళ్ల కెరీర్‌లో 34 టెస్టులు, 167 ODIలు, 68 T20 మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.

రిటైర్‌మెంట్‌ను ప్రకటిస్తూ ధావన్‌.. హలో ఫ్రెండ్స్‌! ఈ రోజు నేను ఒక బిందువు వద్ద నిలబడి ఉన్నాను, నేను వెనక్కి తిరిగి చూస్తే.. నేను చాలా జ్ఞాపకాలను చూశాను. మొత్తం ప్రపంచాన్ని చూశాను. నాకు భారతదేశం తరపున ఆడాల‌నే ఒకే గోల్‌ ఉండేది.. అది జరిగింది. ఇందుకోసం నేను నా కుటుంబానికి, నా చిన్ననాటి కోచ్ తారిక్ సిన్హా, మదన్ శర్మలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఆడిన నా జట్టు ద్వారా కొత్త కుటుంబం దొరికింది. నాకు పేరు దొరికింది. కలిసి వచ్చింది. ఎంతో ప్రేమను పొందాను. కథలో ముందుకు వెళ్లాలంటే పేజీలు తిరగేయాల్సిందే. నేను అదే చేయబోతున్నాను. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నాను. ఈ క్రికెట్ జర్నీకి వీడ్కోలు పలుకుతున్న వేళ.. చాలా కాలం దేశం కోసం ఆడిన ప్రశాంతత నా హృదయంలో ఉంది. నాపై నమ్మకం ఉంచినందుకు బీసీసీఐ, డీడీసీఏలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు చాలా ప్రేమను అందించిన నా అభిమానులకు కూడా ధన్యవాదాలు. ఇకపై దేశం కోసం ఆడలేనని బాధపడవద్దని.. దేశం కోసం చాలా ఆడినందుకు సంతోషించమని నాకు నేనుగా చెబుతున్నాను అని ముగించాడు.

ధావన్ మొహాలీలో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడాడు. 2013 నుంచి ఇప్పటి వరకు 34 టెస్టుల్లో ఆడాడు. ధావన్‌కి చివరిసారిగా 2018లో టెస్టు ఆడే అవకాశం లభించింది. అతను ఆ ఫార్మాట్‌లో 40.61 సగటుతో 2,315 పరుగులు చేశాడు. ఏడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ధావన్ అత్యధిక స్కోరు 190 పరుగులు.

శిఖర్ 2010లో ఆస్ట్రేలియాతో విశాఖపట్నంలో భారత్ తరఫున తొలి వన్డే ఆడాడు. అతడు 167 మ్యాచ్‌ల్లో 6,793 పరుగులు చేశాడు. ధావన్ సగటు 44.11 కాగా.. స్ట్రైక్ రేట్ 91.35. అతడి పేరిట వ‌న్డేల్లో 17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 కెరీర్‌లో ధావన్ 68 మ్యాచ్‌ల్లో 1,759 పరుగులు చేశాడు. టీ20ల్లో 11 అర్ధ సెంచరీలు త‌న పేరిట ఉన్నాయి.

ధావన్ ఐపీఎల్‌లో కూడా చాలా పరుగులు చేశాడు. ఈ టోర్నీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అత్యధిక పరుగులు చేసిన వారిలో విరాట్ కోహ్లీ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ధావన్ 222 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 6,769 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, 51 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ధావన్ ఐపీఎల్‌ సగటు 35.26 కాగా.. స్ట్రైక్ రేట్ 127.14.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story