ఐపీఎల్ 2024 41వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.

ఐపీఎల్ 2024 41వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. అంతకుముందు జరిగిన ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో RCB జట్టు 25 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఈ మ్యాచ్‌లో గెలిచి సన్‌రైజర్స్ పై ప్ర‌తీకారం తీర్చుకుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి, రజత్‌ పటీదార్‌లు ఆర్సీబీ జట్టు తరుపున హాఫ్‌ సెంచరీలు చేశారు. అనంత‌రం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు మ‌త్ర‌మే చేసింది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Updated On 25 April 2024 9:55 PM GMT
Yagnik

Yagnik

Next Story