ప్రపంచకప్ 2023 చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై టీమిండియా 160 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ టోర్నీలో వరుసగా 9వ విజయం సాధించింది. నెదర్లాండ్స్‌పై జట్టు విజయానికి అద్భుతమైన సెంచరీల‌తో రాణించిన‌

ప్రపంచకప్ 2023 చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై టీమిండియా 160 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ టోర్నీలో వరుసగా 9వ విజయం సాధించింది. నెదర్లాండ్స్‌పై జట్టు విజయానికి అద్భుతమైన సెంచరీల‌తో రాణించిన‌ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer), కేఎల్ రాహుల్ హీరోలు. అయ్యర్ అజేయంగా 128 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్(KL Rahul) 102 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా(Teamindia)నే పైచేయి సాధించింది. లీగ్‌లో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది.

ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడవలసి ఉంటుంది. ఈ మ్యాచ్ నవంబర్ 15న ముంబైలో జరుగుతుంది. కాగా, రోహిత్ శర్మ(Rohit Sharma) అద్భుతమైన కెప్టెన్సీని కొనియాడుతూ అతని చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్(Dinesh Lad) ఒక ప్రకటన చేశారు.

భారత్(India) వర్సెస్ న్యూజిలాండ్(Newzealand) సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. భారత జట్టు అద్భుతంగా రాణిస్తోందని.. మ్యాచ్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. మన దగ్గర ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌లు అద్భుతంగా ఆడుతున్నట్లు కనిపిస్తోందని చెప్పాడు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ జట్టును బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది. న్యూజిలాండ్‌పై రోహిత్ సెంచరీ సాధించాలని నేను కోరుకుంటున్నాను.. అతను ఇన్నింగ్సును బాగా ప్రారంభించి దేశం కోసం ఆడితే నేను సంతోషిస్తానని పేర్కొన్నారు.

Updated On 13 Nov 2023 9:55 PM GMT
Yagnik

Yagnik

Next Story