స్వల్ప లక్ష్యఛేదనలో ముంబై చేజేతులా మ్యాచ్ ను కోల్పోయింది

మహిళల ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌)లో ఆర్‌సీబీ ఫైనల్ కు చేరుకుంది. ముంబైతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 5 పరుగుల తేడాతో ముంబైపై విజయం సాధించింది. తొలుత ఎలీస్‌ పెర్రీ (50 బంతుల్లో 66, 8ఫోర్లు, సిక్స్‌) అర్ధసెంచరీతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 135/6 స్కోరు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన ముంబై 20 ఓవర్లలో 130/6 స్కోరు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌కౌర్‌(33) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. శ్రేయాంక పాటిల్‌ (2/16) రెండు వికెట్లు తీయగా, పెర్రీ, మిలోనెక్స్‌, వేర్‌హామ్‌, ఆశా శోభన ఒక్కో వికెట్‌ తీశారు. అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమైన పెర్రీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

స్వల్ప లక్ష్యఛేదనలో ముంబై చేజేతులా మ్యాచ్ ను కోల్పోయింది. 24 బంతుల్లో 32 పరుగులు అవసరమైన దశలో ముంబై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఆఖరి 12 బంతుల్లో ముంబైకి ఒక్క బౌండరీ కూడా రాకపోవడం ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆదివారం జరిగే లీగ్‌ ఫైనల్లో ఢిల్లీ, ఆర్‌సీబీ తలపడుతాయి.

Updated On 15 March 2024 10:19 PM GMT
Yagnik

Yagnik

Next Story