ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరింత దగ్గరైంది

ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరింత దగ్గరైంది. ఆ జట్టు మరో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు ఛేదించలేకపోయారు. బెంగళూరు బౌలర్లు రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ అయింది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ పటేల్ (57) మినహా ఎవరూ పెద్ద రాణించలేకపోయారు. షాయ్ హోప్ (29), జేక్ ఫ్రేజర్ (21) పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్ కు రిషబ్ పంత్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పేసర్ యశ్ దయాల్ 3 వికెట్లతో చెలరేగాడు. లూకీ ఫెర్గూసన్ 2, గ్రీన్, మహ్మద్ సిరాజ్, స్వప్నిల్ సింగ్ తలో వికెట్ తీశారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 54 పరుగులతో రజత్ పటీదార్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విల్ జాక్స్ (41), కోహ్లీ (27), గ్రీన్ (32 నాటౌట్) రాణించారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఫ్లే ఆఫ్స్ అకాశాలు సజీవంగానే ఉన్నాయి. ప్రస్తుతం 12 విజయాలు, మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది.

Updated On 12 May 2024 9:07 PM GMT
Yagnik

Yagnik

Next Story