రాజస్థాన్ రాయల్స్‌ ను పంజాబ్ కింగ్స్ నిలువరించింది

రాజస్థాన్ రాయల్స్‌ ను పంజాబ్ కింగ్స్ నిలువరించింది. గువాహటి వేదికగా సాగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలోనే పంజాబ్ ఛేదించింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కర్రాన్ బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో రాణించాడు. సామ్ కర్రాన్ 41 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టుని గెలిపించాడు. పంజాబ్ బ్యాటర్లలో రూసో (22), జితేశ్ శర్మ (22), అశ్‌తోశ్ శర్మ (17 నాటౌట్), బెయిర్‌స్టో (14), శశాంక్ సింగ్ (0), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (6) పరుగులు చేశారు. ఒకానొక దశలో పంజాబ్ జట్టు తడబడినా ఆఖర్లో రాజస్థాన్ కు షాక్ ఇచ్చాడు సామ్ కర్రాన్. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అవేశ్ ఖాన్, చాహల్ చెరో రెండు వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ ఒక వికెట్ తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. 34 బంతుల్లో 48 పరుగులు చేసిన రియాన్ పరాగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో సామ్ కర్రాన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలో రెండేసి వికెట్లు తీశారు. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్‌కు వరుసగా నాలుగవ ఓటమి ఎదురైంది. ఇక పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. రాజస్థాన్‌పై విజయంతో ఐపీఎల్ 2024లో 10వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరింది.

Updated On 15 May 2024 9:31 PM GMT
Yagnik

Yagnik

Next Story