Mumbai Indians vs Punjab Kings : ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ముంబైని ఓడించిన పంజాబ్ కింగ్స్.. ఈ మ్యాచ్లో ఆ బౌలరే హీరో..!
ఐపీఎల్-2023లో 31వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం తప్పు అని తేలింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ అద్భుత ప్రదర్శన చేశారు. పంజాబ్ కింగ్స్ ముంబైకి 215 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనకు దిగిన ముంబై జట్టు 13 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Punjab Kings edge past Mumbai Indians in a high-scoring thriller
ఐపీఎల్-2023లో 31వ మ్యాచ్ ముంబై ఇండియన్స్(Mumbai Indians), పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం తప్పు అని తేలింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ అద్భుత ప్రదర్శన చేశారు. పంజాబ్ కింగ్స్ ముంబైకి 215 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనకు దిగిన ముంబై జట్టు 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బౌలర్ అర్ష్దీప్ సింగ్(Arshdeep Singh) పంజాబ్ తరుపున అద్భుతమైన బౌలింగ్తో రాణించి హీరో ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు.
ముంబై ఇండియన్స్ ఆరంభంలో ఓపెనర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, కెమెరూన్ గ్రీన్(Cameron Green) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు ఆడుతున్నప్పుడు.. ముంబై విజయం ఖాయం అనిపించింది. అయితే.. 44 పరుగుల వద్ద రోహిత్ ఔటయ్యాడు. గ్రీన్ 67 పరుగులు చేశాడు. రోహిత్ ఔటయ్యాక పరుగులు రాబట్టే బాధ్యతను సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) స్వీకరించాడు. సూర్య 26 బంతుల్లో 7 ఫోర్లు, 3 లాంగ్ సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. చివర్లో టిమ్ డేవిడ్(Tim David) 13 బంతుల్లో 25 పరుగులు చేసినా ముంబై ఇండియన్స్ గెలవలేకపోయింది.
పంజాబ్ కింగ్స్ తరఫున అర్ష్దీప్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. చివరి ఓవర్లో 2 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్ కారణంగానే పంజాబ్ మ్యాచ్ను గెలిచింది. మ్యాచ్లో మొత్తం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. నాథన్ ఎల్లిస్, లియామ్ లివింగ్స్టోన్ చెరో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ అద్భుత ప్రదర్శన చేశారు. మాట్ షార్ట్ 11 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ప్రభ్సిమ్రాన్ సింగ్ 26 పరుగులు చేశాడు. అథర్వ తైడే 29 పరుగులు చేశాడు. లియామ్ లివింగ్స్టోన్(liam Livingstone) పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అతను 10 పరుగులు మాత్రమే రాబట్టాడు. ఆ తర్వాత హర్ప్రీత్ సింగ్ భాటియా, కెప్టెన్ సామ్ కరణ్(Sam Curran) భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరు బ్యాట్స్మెన్లు అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. మైదానం అంతటా స్ట్రోక్లు కొట్టారు. హర్ప్రీత్ 41 పరుగులు చేశాడు. సామ్ 55 పరుగులలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో జితేష్ శర్మ 7 బంతుల్లో 25 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 214 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పీయూష్ చావ్లా(Piyush Chawla, కెమెరూన్ గ్రీన్ తలా 2 వికెట్లు తీయగా.. అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar), జాసన్ బెహ్రెన్డార్ఫ్(Behrendorff) చెరో వికెట్ పడగొట్టారు.
ఐపీఎల్లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ 30 మ్యాచ్లు ఆడగా.. అందులో ముంబై జట్టు 15 మ్యాచ్ల్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ కూడా 15 మ్యాచ్ల్లో విజయం సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. పంజాబ్ కింగ్స్ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేదు.
