భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni)కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అభిమానులు ఆయన్ను దేవుడిలా చూసుకుంటారు. ధోనీ అభిమానులు అతనిని కలవడానికి స్టేడియంకు పరుగులు తీయడం మ‌నం సోషల్ మీడియా(Social Media)లో చాలాసార్లు చూసి ఉంటాం.

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni)కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అభిమానులు ఆయన్ను దేవుడిలా చూసుకుంటారు. ధోనీ అభిమానులు అతనిని కలవడానికి స్టేడియంకు పరుగులు తీయడం మ‌నం సోషల్ మీడియా(Social Media)లో చాలాసార్లు చూసి ఉంటాం. మహేంద్ర సింగ్ ధోనీ తన అలవాట్లతో అంద‌రి హృదయాల‌ను గెలుచుకుంటాడు. ఇటీవల.. ధోనీ 88 ఏళ్ల మహిళా అభిమానిని కలుసుకున్నాడు. దీంతో నెట్టింట మ‌రోసారి ధోనీ హాట్ టాఫిక్ అయ్యాడు.

నటి ఖుష్బు సుందర్(Khushbu Sundar) ఒక ట్వీట్‌ను షేర్ చేసింది. ఆ ట్వీట్ నెట్టింట‌ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌లో.. హీరోలు పుడ‌తారు.. తయారు చేయబడరని ధోనీ నిరూపించాడు. ధోనీ ఈ రోజు 88 ఏళ్ల నా అత్తగారిని కలిశాడు. ఇందుకు నా దగ్గర మాటలు లేవు. మమీ మీరు ఆమె వయస్సుకి మరికొన్ని సంవత్సరాలు మంచి ఆరోగ్యం, ఆనందాన్ని జోడించారు. మీకు నేను నమస్కరిస్తున్నాను. దీన్ని సాధ్యం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధన్యవాదాలు అని రాసుకొచ్చింది.

ఖుష్బు సుందర్ తన కెరీర్‌లో ఎన్నో హిట్ చిత్రాలలో న‌టించింది. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో ఉన్నారు. ఈ ఫోటోను అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారు. కామెంట్ల వర్షం కురుస్తోంది. 88 ఏళ్ల వృద్ధురాలు మహేంద్ర సింగ్ ధోనీ(Dhoni)ని కలవడం చాలా సంతోషంగా ఉందని ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫోటోలో 88 ఏళ్ల మహిళ మహి చెంపపై ముద్దు పెడుతుంది.

Updated On 16 April 2023 5:04 AM GMT
Yagnik

Yagnik

Next Story