భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయనకు టీమ్ ఇండియా జెర్సీని బహూకరించారు.

భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయనకు టీమ్ ఇండియా జెర్సీని బహూకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా.. ఆ వీడియోలో కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ కూడా కనిపించారు. టీమ్ ఇండియా ICC T20 ప్రపంచ కప్ విజయం సాధించిన‌ తర్వాత.. ఇటీవ‌ల‌ హైదరాబాద్‌లో అడుగుపెట్టిన భారత పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు క్రికెట్ అభిమానుల నుండి ఘన స్వాగతం లభించింది.

బాణసంచా కాల్చడం, దేశభక్తి గీతాలు, లౌడ్ స్పీకర్లతో మార్ఫా బీట్‌ల‌తో అభిమానులు 30 ఏళ్ల సిరాజ్‌కు ఘ‌న‌ స్వాగతం పలికారు. ఇక బీసీసీఐ ప్ర‌క‌టించిన రూ.125 కోట్ల‌ న‌జ‌రాణాలో మహ్మద్ సిరాజ్ సహా 15 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు అందుతాయి. ఫైన‌ల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి టీ20 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది.

Eha Tv

Eha Tv

Next Story