ఐపీఎల్ 2024 51వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేకేఆర్‌పై ఘోర పరాజయాన్ని చవిచూసింది. వాంఖడే వేదికగా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.

ఐపీఎల్ 2024 51వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేకేఆర్‌పై ఘోర పరాజయాన్ని చవిచూసింది. వాంఖడే వేదికగా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 169 పరుగులకు ఆలౌట్ అయింది. అనంత‌రం ముంబై 18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. స్టార్క్ నాలుగు వికెట్లు తీశాడు.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి మంచి ఆరంభం ద‌క్క‌లేదు. రెండో ఓవర్‌లోనే ఇషాన్‌ కిషన్‌ వికెట్‌ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ తొలి వికెట్‌ తీశాడు. రోహిత్ శర్మ 11 పరుగులు చేసిన తర్వాత సునీల్ నారాయణ బౌలింగ్‌లో అవుట‌య్యాడు. 71 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోగా.. సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్ జట్టును మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకొచ్చారు. 56 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ రస్సెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్ ఆశలకు తెరపడింది. మిచెల్ స్టార్క్ 19వ ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. స్టార్క్.. టిమ్ డేవిడ్, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీలను అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టార్క్ మొత్తం నాలుగు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ లు తలో రెండు వికెట్లు తీశారు.

అంతకుముందు కోల్‌కతా జట్టు తరఫున వెంకటేష్ అయ్యర్ అత్యధికంగా 70 పరుగులు చేశాడు. మనీష్ పాండే 42 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా 18 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. నువాన్ తుషార మూడు వికెట్లు తీశాడు.

Updated On 3 May 2024 9:24 PM GMT
Yagnik

Yagnik

Next Story