2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్.. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి

IPL 2024 సీజన్‌కు ముందు క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ నుండి మ్యాచ్-రెడీ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ సొంతం చేసుకున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మైదానంలోకి తిరిగి రాబోతున్నాడు. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్.. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి దిగకపోవడం అభిమానులను బాధిస్తూ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‍గా ఉన్న పంత్ గతేడాది ఐపీఎల్‍లో బరిలోకి దిగలేదు. ప్రస్తుతం పంత్ కోలుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2024 సీజన్‍లో అతడు ఆడనున్నాడు.

పంత్‌కు గత వారం సర్టిఫికేట్ లభించిందని తెలుస్తోంది. యాక్సిడెంట్ తర్వాత కోలుకున్న 26 ఏళ్ల పంత్ ఎలా ఆడతాడు అనే విషయమై అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు. పంత్ ప్రస్తుతం టోర్నీ ప్రచార కార్యక్రమం కోసం కొన్ని షూట్‌లు చేస్తున్నాడు. కొన్ని రోజులు ఢిల్లీలో ఉండనున్నాడు. అతను DC కోసం IPL 2024 సీజన్ ప్రారంభానికి ముందు శిబిరంలో చేరడానికి వైజాగ్‌కు బయలుదేరాడు.

Updated On 10 March 2024 10:38 AM GMT
Yagnik

Yagnik

Next Story