రాబోయే ప్ర‌పంచ‌క‌ప్‌ ఎడిషన్‌కు ముందు పురుషుల T20I టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌కు 264 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.

రాబోయే ప్ర‌పంచ‌క‌ప్‌ ఎడిషన్‌కు ముందు పురుషుల T20I టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌కు 264 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ నాలుగో స్థానానికి ఎగబాకింది, టీ20 టోర్నీకి ముందు ఆ దేశ ఆట‌గాళ్లు కూడా అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నారు.

2012, 2016 సంవ‌త్స‌రాల‌లో విజేత అయిన‌ విండీస్‌.. దక్షిణాఫ్రికాపై 3-0 తేడాతో విజయం సాధించిన తర్వాత న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా కంటే ర్యాంకింగ్స్‌లో ముందున్నారు. 2021 ఛాంపియన్ ఆస్ట్రేలియా 257 పాయింట్లతో రెండో స్థానంలో, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 254 పాయింట్లతో మూడో స్థానంలో, వెస్టిండీస్ 252తో రెండు పాయింట్లు వెనుకబడి నాలుగో స్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్ 250 పాయింట్ల‌తో ఐదో స్థానం.. పాకిస్తాన్, దక్షిణాఫ్రికా రెండూ 244 పాయింట్లతో ఆరు, ఏడు స్థానాల‌లో ఉండ‌గా.. పాక్‌ దశాంశ పాయింట్లలో కొంచెం ముందుంది.

Updated On 29 May 2024 9:03 PM GMT
Yagnik

Yagnik

Next Story