120 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ బ్యాటర్లు మొదట్లో కాస్త బాగానే ఆడారు

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ థ్రిల్లర్ మూవీలా సాగింది. టీ20 వరల్డ్ కప్ గ్రూప్-ఏ మ్యాచ్ లో పాకిస్థాన్ మీద భారత్ విజయం సాధించింది. 6 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించింది. 120 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు అద్భుతంగా చెలరేగడంతో టీమిండియా 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 3 కీలక వికెట్లతో అద్భుతంగా బౌలింగ్ వేసిన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ అత్యధికంగా 42 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 20, కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులు చేశారు. కోహ్లీ 4, సూర్యకుమార్ యాదవ్ 7, శివమ్ దూబే 3, హార్దిక్ పాండ్యా 7, రవీంద్ర జడేజా 0 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో నసీమ్ షా 3, హరీస్ రవూఫ్ 3, మహ్మద్ అమీర్ 2, షహీన్ అఫ్రిది 1 వికెట్ తీశారు.

120 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ బ్యాటర్లు మొదట్లో కాస్త బాగానే ఆడారు. 11.5 ఓవర్లలో 71/2 స్కోర్‌తో పాకిస్థాన్ పటిష్టమైన స్థితిలో కనిపించింది. అయితే ఏ మాత్రం పరుగులు ఇవ్వకుండా.. కీలక సమయంలో వికెట్లు తీసి, పరుగులు నియంత్రించి మ్యాచ్ విజయం కోసం పోరాడారు. చివరకు ఉత్కంఠ భరిత విజయాన్ని అందుకున్నారు. 31 పరుగులు చేసిన పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో బాబర్ ఆజం 13, ఉస్మాన్ ఖాన్ 13, ఫకర్ జమాన్ 13, ఇమాద్ వసీమ్ 15, షాదాబ్ ఖాన్ 4, ఇఫ్తీకర్ అహ్మద్ 5, షాహీన్ ఆఫ్రిదీ 0 (నాటౌట్), నషీమ్ షా 10(నాటౌట్) పరుగులు చేశారు. హార్ధిక్ పాండ్యా కీలక దశలో 2 ముఖ్యమైన వికెట్లు తీశాడు. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.

Updated On 9 Jun 2024 9:23 PM GMT
Yagnik

Yagnik

Next Story