దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం (జనవరి 20) జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 84 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.

దక్షిణాఫ్రికా(South Africa)లో జరుగుతున్న అండర్‌-19 ప్రపంచకప్‌(ICC U-19 World Cup)లో భారత జట్టు(TeamIndia) శుభారంభం చేసింది. శనివారం (జనవరి 20) జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 84 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌(Bangladesh)ను ఓడించింది. భారత్ చివరిసారిగా 2022లో ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బౌలింగ్ చేయగా.. భారత్ ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంత‌రం బంగ్లాదేశ్ జట్టు 167 పరుగులకే ఆలౌటైంది.

భారత్ తరఫున ఆదర్శ్ సింగ్(Adarsh Singh) అత్యధికంగా 76 పరుగులు చేశాడు. కెప్టెన్ ఉదయ్ సహారన్(Uday Saharan) 64 పరుగులు చేశాడు. సచిన్ దాస్ 26 పరుగులు చేయగా, ప్రియాంషు(Priyanshu)-అవినీష్(Avineesh) త‌లా 23 పరుగులు చేశారు. బంగ్లాదేశ్‌ తరఫున మరూఫ్‌ మృదా ఐదు వికెట్లు తీశాడు. మహ్మద్ రిజ్వాన్, రెహమాన్ రెడ్డిలకు చెరో వికెట్ దక్కింది.

బంగ్లాదేశ్ జ‌ట్టులో మహ్మద్ సిహాబ్ జేమ్స్ అత్యధికంగా 54 పరుగులు చేశాడు. అరిఫుల్ ఇస్లామ్ 41 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కాకుండా కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు. షేక్ పెవెజ్ జిబోన్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా, ఎషికుర్ రెహ్మాన్ సిబ్లీ, జిషాన్ ఆలం చెరో 14 పరుగులు చేశారు. భారత్ తరఫున సౌమ్య పాండే నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముషీర్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. రాజ్ లింబానీ, అర్షిన్ కులకర్ణి, ప్రియాంషు మోలియాలకు ఒక్కో వికెట్ దక్కింది.

Updated On 20 Jan 2024 9:49 PM GMT
Yagnik

Yagnik

Next Story