బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్‌నగరంలోని దర్గా మొహల్లాలో నివాసం ఉంటున్నకూలీ కొడుకు షకీబ్ హుస్సేన్. తండ్రి సౌదీ అరేబియాలో కూలీ ప‌నిచేస్తున్నాడు.

బీహార్(Bihar) రాష్ట్రం గోపాల్‌గంజ్‌(Gopal Gunj) నగరంలోని దర్గా మొహల్లాలో నివాసం ఉంటున్నకూలీ కొడుకు షకీబ్ హుస్సేన్(Sakib Hussain). తండ్రి సౌదీ అరేబియా(Southi Arabia)లో కూలీ ప‌నిచేస్తున్నాడు. షకీబ్ హుస్సేన్ ఇప్పుడు ఐపీఎల్ వేలం జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కొడుకు ఎంపిక వార్త తెలియడంతో కుటుంబ స‌భ్యులు, బంధువుల్లో ఆనందం వెల్లివిరిసింది. దర్గా మొహల్లా నివాసి అహ్మద్ హుస్సేన్ కుమారుడు షకీబ్ హుస్సేన్ IPL- 2024 ప్లేయర్ వేలం జాబితాలో ఉన్నాడనే వార్త ఇప్పుడు తెల‌గ వైర‌ల్(Viral) అవుతుంది.

ఐపీఎల్ వేలం(IPL Auction)లో షకీబ్ పాల్గొంటాడన్న వార్త తెలిసిన వెంటనే కుటుంబంతో పాటు జిల్లాలో ఆనంద వాతావరణం నెలకొంది. ప్రస్తుతం షకీబ్ బెంగళూరులో ఉన్నాడు. ఐపీఎల్ వేలం సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు. షకీబ్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్(Right Arm Fast Bowler). ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) లో నెట్ బౌలర్(Net Bowler) గా ఉన్నాడు. షకీబ్ బేస్ ధర రూ.20 లక్షలు.

సమాచారం ప్రకారం.. దర్గా మొహల్లాలో నివాసం ఉంటున్న షకీబ్ తండ్రి అలీ అహ్మద్ హుస్సేన్ వృత్తి రీత్యా ఉప్పుటేరు కూలీ. నలుగురు అన్నదమ్ముల్లో మూడోవాడైన షకీబ్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. నగరంలోని మింజ్ స్టేడియంలో ర‌న్నింగుకు వెళ్తున్న స‌మ‌యంలో క్రికెట్‌పై అతనికి ఆస‌క్తి పెరగడం మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్ నెట్ బౌల‌ర్‌గా చేరిన వెంటనే షకీబ్ ధోనీకి ఫేవరెట్ అయ్యాడు. ధోనీతో అతని బంధం చాలా బాగుంది. షకీబ్ మైదానంలో ధోనీతో చర్చిస్తున్నట్లు ఫోటోల‌లో కూడా కనిపిస్తుంటాడు.

క్రికెట్ క్రీడాకారులను చూసి తాను కూడా మంచి క్రికెటర్‌గా ఎదిగి తన కుటుంబానికి, జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలనే కోరిక అతని మనసులో మెదిలింది. ఇంటర్మీడియట్ వరకు చదివిన షకీబ్ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు.

మింజ్ స్టేడియంలో జరిగిన దేవధారి గిరి టోర్నీలో ఆడే అవకాశం వచ్చింది. దీని తర్వాత అతను 2021లో పాట్నాలో జరిగిన‌ బీహార్ క్రికెట్ లీగ్‌లో ఆడాడు. ఆ తర్వాత అండర్ 19 ఆడేందుకు చండీగఢ్ వెళ్లాడు. ఇందులో అత్యధిక వికెట్లు తీశాడు. దీని తర్వాత అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు. దీని తర్వాత ముస్తాక్ అలీ ట్రోఫీని ఆడే అవకాశం వచ్చింది. ఆ సమయంలోనే షకీబ్ మెరుగైన బౌలింగ్‌ చూసి, KKR, ముంబై, ఢిల్లీ, RCB, చెన్నై నుండి కాల్స్ వచ్చాయి. దీని తర్వాత చెన్నైకి నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. ష‌కీబ్‌ ట్రయల్స్ ఇవ్వడానికి ఢిల్లీకి వెళ్లగా.. ట్రయల్స్(Trails) చూసిన తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni), సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) అత‌డిని చాలా మంచి ఆటగాడు అని ప్రశంసించారు.

డిసెంబర్ 19న దుబాయ్‌(Dubai)లో జరగనున్న 214 మంది భారత ఆటగాళ్లలో గోపాల్‌గంజ్‌కు చెందిన షకీబ్ పేరు కూడా ఉంది. ముఖేష్ తర్వాత షకీబ్ ఐపీఎల్‌లో చేర‌నుండ‌టంతో జిల్లా క్రికెట్ ప్రేమికుల్లో ఉత్కంఠ నెలకొంది.

Updated On 13 Dec 2023 11:33 PM GMT
Yagnik

Yagnik

Next Story