క్రికెట్ ప్రపంచ కప్ 2023లో(Cricket World Cup-2023) భాగంగా భారత్(India), పాకిస్థాన్(Pakistan) మధ్య జరిగే మ్యాచ్ నవరాత్రి పండుగ నేప‌థ్యంలో వాయిదా ప‌డే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కొత్త తేదీని ప్ర‌క‌టించే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం. వాస్తవానికి అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో(Ahmedabad) మ్యాచ్ జరగాల్సి ఉంది. ఐసీసీ(ICC) నవరాత్రుల‌ మొదటి రోజున మ్యాచ్‌ను షెడ్యూల్ చేసింది.

క్రికెట్ ప్రపంచ కప్ 2023లో(Cricket World Cup-2023) భాగంగా భారత్(India), పాకిస్థాన్(Pakistan) మధ్య జరిగే మ్యాచ్ నవరాత్రి పండుగ నేప‌థ్యంలో వాయిదా ప‌డే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కొత్త తేదీని ప్ర‌క‌టించే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం. వాస్తవానికి అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో(Ahmedabad) మ్యాచ్ జరగాల్సి ఉంది. ఐసీసీ(ICC) నవరాత్రుల‌ మొదటి రోజున మ్యాచ్‌ను షెడ్యూల్ చేసింది. న‌వ‌రాత్రులు గుజరాత్(Navrathri) అంతటా జరుపుకునే ముఖ్యమైన పండుగ. భద్రతా కారణాల దృష్ట్యా.. పునఃపరిశీలించాలని బీసీసీఐకి(BCCI) భ‌ద్ర‌తా సంస్థ‌లు సూచించిన‌ట్లు తెలుస్తోంది.

భారత్‌, పాక్‌ మధ్య మ్యాచ్ టికెట్లు గంటల్లోనే అమ్ముడవుతాయి. టెలివిజన్ రేటింగ్‌ల మీద కూడా ప్ర‌భావం ఉండ‌దు. అయితే.. ఆ రోజు మ్యాచ్ డేట్‌ను మార్చడం వలన.. ఇప్పటికే ప్ర‌యాణ‌ టిక్కెట్‌లు బుక్ చేసుకున్న అభిమానులకు మాత్రం ఇది చేదు వార్త కావ‌చ్చు.

నవరాత్రి పండుగ కారణంగా తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐకి సూచించాయి. కాబట్టి భార‌త్‌, పాక్‌ ప్రపంచ కప్ మ్యాచ్ తేదీని మార్చవచ్చు. ఇది అంత తేలికైన పని కాదు.. మ్యాచ్ వెనుక చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయాన్ని చూసుకోవాలి. చివరిగా చర్చిద్దాం, అప్పుడు మాత్రమే ప్రతిస్పందించగలం. అయితే.. భద్రతను దృష్టిలో ఉంచుకుని తేదీని మార్చాల్సిన అవసరం ఉంటే చేస్తామ‌ని బీసీసీఐ వ‌ర్గాలు పేర్కొన్న‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి.

దాదాపు 1 లక్ష మంది సామర్థ్యం కలిగిన నరేంద్ర మోదీ స్టేడియం.. న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య టోర్నమెంట్ మొద‌టి మ్యాచ్‌కు, ఇండియా vs పాకిస్తాన్, ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ స‌హా ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ కప్ మ్యాచ్‌లు 10 న‌గ‌రాల్లో జ‌ర‌గ‌నున్నాయి, సెమీఫైనల్స్ మ్యాచ్‌లు ముంబై, కోల్‌కతాల‌లో జరగనున్నాయి.

భార‌త్‌, పాక్ మ్యాచ్ నేప‌థ్యంలో అహ్మదాబాద్ లో ఇప్పటికే అక్టోబర్ మధ్య వారంలో హోటల్ వసతీ సంక్షోభం నెల‌కొంది. మ్యాచ్‌లు ఉండ‌టంతో విమాన ఛార్జీలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. ఒక వేళ అహ్మ‌దాబాద్ వేదిక‌గా భార‌త్‌, పాక్‌ మ్యాచ్‌కు కొత్త తేదీని ప్రకటిస్తే.. రీబుకింగ్ చేసుకునే అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎటువంటి నిర్ణ‌యం వెలువ‌డుతుందా అనే ఉత్కంఠ నెల‌కొంది.

Updated On 26 July 2023 1:15 AM GMT
Ehatv

Ehatv

Next Story