డబ్ల్యూపీఎల్‌-2024(wpl-2024) రెండో సీజన్‌ సూపర్‌ హిట్టయ్యింది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ పోరులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) పురుషుల జట్టు గత 16 ఏళ్లుగా సాధించలేనిది మహిళల జట్టు మాత్రం రెండో సీజన్‌లోనే టైటిల్ సాధించడం విశేషం.

డబ్ల్యూపీఎల్‌-2024(wpl-2024) రెండో సీజన్‌ సూపర్‌ హిట్టయ్యింది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ పోరులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) పురుషుల జట్టు గత 16 ఏళ్లుగా సాధించలేనిది మహిళల జట్టు మాత్రం రెండో సీజన్‌లోనే టైటిల్ సాధించడం విశేషం. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళల జట్టును సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి వంటి దిగ్గజ క్రికెటర్లు అభినందించారు. అభినందనలు తెలిపారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన(Smriti Mandhana) తన బాయ్‌ఫ్రెండ్‌ పలాష్‌ ముచ్చల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపూ ఆర్‌సీబీకి మద్దతునిస్తూ కనిపించాడు. గెలిచిన తర్వాత పలాష్‌తో కలిసి స్మృతి పోటోలకు పోజులిచ్చింది. ట్రోఫీని పట్టుకుని మరీ ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నిరుడు చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు స్వర్ణం సాధించింది. అప్పుడు కూడా పలాష్‌తో కలిసి స్మృతి ఫోటోలు దిగింది. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. బాలీవుడ్‌లో మంచి సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పలాష్‌కు ఓ వేడుకలో స్మృతి పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.

Updated On 18 March 2024 3:35 AM GMT
Ehatv

Ehatv

Next Story